సింగరేణి ఛైర్మన్& ఎం.డి. ఎన్.శ్రీధర్ 'ప్రైడ్ ఆఫ్ హైదరాబాద్ అవార్డు'కు ఎన్నికయ్యారు. సింగరేణి సంస్థను అత్యద్భుత వృద్ధి రేటుతో నడుపుతూ అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చిన ఆయనకు ఈ ప్రతిష్ఠాత్మక గుర్తింపు లభించింది. పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా వారు 'ప్రైడ్ ఆఫ్ హైదరాబాద్ అవార్డు'కు ఆయనను ఎంపిక చేసి ఘనంగా సన్మానించారు. శుక్రవారం హైదరాబాద్లో జరిగిన 41వ ఆల్ ఇండియా పబ్లిక్ రిలేషన్స్ సోసైటీ ఆఫ్ ఇండియా కాన్ఫరెన్సు-2019కు ముఖ్య అతిథిగా రాష్ట్ర హోంశాఖా మంత్రి మహమూద్ అలీ హాజరయ్యారు. ఆయన చేతుల మీదుగా సింగరేణి చైర్మన్ ను సన్మానించి, అవార్డు అందించారు. ఈ సందర్భంగా హోం మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశంలో ఎన్.శ్రీధర్ సింగరేణిని అత్యద్భుత రీతిలో అభివృద్ధి పథంలో నడిపిస్తూ.. తెలంగాణ పరిశ్రమ ప్రతిభకు జాతీయ స్థాయిలోనే కాక అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చారని ప్రశంసించారు.
‘ప్రైడ్ ఆఫ్ హైదరాబాద్ అవార్డు’కు ఎంపికైన సింగరేణి ఛైర్మన్..